విపత్తుల సమయంలో మానవత్వం ఉన్న ఎవరైనా ప్రజలకు సాయం చేస్తారు. జగన్ మాత్రం ఫేక్ న్యూస్ వ్యాప్తి చేస్తూ విష రాజకీయాలు చేస్తున్నారు.
బెంగళూరు ప్యాలెస్ లో సేదతీరుతూ అసత్య ప్రచారాలను వ్యాప్తి చేస్తున్నారు అని లోకేష్ అన్నారు .
కాకినాడ జిల్లా కొత్తపల్లి పునరావాస కేంద్రంలో ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. అత్యవసర సాయానికి టోల్ ఫ్రీ నెంబర్ 18004250101 ఏర్పాటు చేసారు.
వదంతులు నమ్మొద్దు ఇది ప్రజల ప్రభుత్వం అని మంత్రి నారా లోకేష్ అన్నారు.

