రాష్ట్రాభివృద్ధిని అడ్డుకుంటూ జగన్ విలన్లా మారారు అని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు.
సినిమాల్లో విలన్ మాదిరిగా త్వరలోనే జగన్ కథ కూడా ముగుస్తుంది. పాలకొల్లులో జరుగుతున్న అభివృద్ధిపై వైసీపీ నాయకులు విషం చిమ్ముతున్నారు.
పాలకొల్లు 100 పడకల ఆస్పత్రిని గత ప్రభుత్వం పట్టించుకోలేదు, ఆస్పత్రిని పూర్తిస్థాయిలో పునరుద్ధరించి సర్జరీ, మెడికల్ పరికరాలు ఏర్పాటు చేశాం.
రూ.5 కోట్లతో పాలకొల్లులో పలుచోట్ల అభివృద్ధి పనులు చేపట్టాం, రూ.22 కోట్లతో పాలకొల్లులో మరో పెద్ద ఆస్పత్రి నిర్మాణానికి ప్రతిపాదన చేశాం అని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు.


బీజేపీలో టీడీపీ విలీనం చెందిందన్నది వట్టిదే: గల్లా జయదేవ్