ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమాతో డెటెక్టివ్గా కనిపించి అందరిని ఆకట్టుకున్నాడు హీరో నవీన్ పోలిసెట్టి. ప్రస్తుతం అనుదీప్ కేవీ దర్శకత్వంలో జాతిరత్నాలు అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాను మాహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ నిర్మించాడు. ఈ సినిమాలో ప్రియదర్శి, రామకృష్ణ ప్రధాన పాత్రల్లో కనిపించారు. ఈ సినిమా విడుదల కూడా కరోనా కారణంగా నిలిచింది. ఇంకా ఈ సినిమా విడుదలపై మేకర్స్ క్లారిటీ ఇవ్వలేదు. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తయిందని, పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా జరిగాయని సమాచారం. ఈ సినిమాకు సంబంధించిన కొత్త పోస్టర్ను ఇటీవల విడుదల చేశారు. అయితే.. తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ వచ్చింది. ఆ టీజర్లో హీరో నవీన్ పోలిసెట్టి అందరినీ ఆకట్టుకునే విధంగా ఉన్నాడు.
previous post


థూ.. దీనమ్మా జీవితం… ఆంటీ ఏంటి ? : పూరీ