తెలుగు చిత్ర పరిశ్రమలో మరో విషాదం నెలకొంది.. తెలుగు చిత్ర పరిశ్రమకు ఎన్నో అద్భుతమైన పాటలను అందించిన ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి ఇకలేరు.
న్యూమోనియా కారణంగా నవంబర్ 24న సిరివెన్నెల సికింద్రాబాద్లోని కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన మంగళవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. 35ఏళ్ల సినీ ప్రస్థానంలో దాదాపు 100కు పైగా సినిమాల్లో దాదాపు మూడు వేలకుపైగా పాటలను రచించిన ఈ మాంత్రికుడికి 11 రాష్ట్ర నంది అవార్డులు, నాలుగు ఫిల్మ్ఫేర్ పురస్కారాలు వరించాయి.
1986లో సిరివెన్నెల సినిమాతో పాటల రచయితగా తెలుగు తెరపై అడుగు పెట్టారు సీతారామశాస్త్రి . మొదటి సినిమానే అతని ఇంటి పేరుగా మార్చుకొని సిరివెన్నల సీతారామశాస్త్రిగా పేరుగాంచారు. అంతేకాదు ఆ సినిమాకు గాను ఉత్తమ గేయ రచయితగా అవార్డుని అందుకున్నారు.
అలా మొదలైన సీతారాశాస్త్రి సినీ జర్నీలో ఎన్నో అద్భుతమైన పాటలు జాలువారాయి. 2019లో ఆయన పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు. స్వర్ణ కమలం, గాయం, శుభలగ్నం, సింధూరం, చక్రం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు వంటి ఎన్నో సినిమాల్లోని పాటలకు గాను సిరివెన్నెల నంది అవార్డులు సొంతం చేసుకున్నారు. రామ్చరణ్ ఎన్టీఆర్ నటించిన ఆ ర్ఆర్ఆర్ మూవీలోని ‘దోస్తీ’ పాట లిరిక్స్ ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది.ఆయన మృతి పట్ల పలువురు సినీప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
తల్లి వ్యాఖ్యలపై వివాదంలో చిన్మయి