మలేషియా ఓపెన్ లో భారత స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు సెమీ ఫైనల్కు చేరారు.
జపాన్కు చెందిన థర్డ్ సీడ్ అకానె యమగూచితో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో, సింధు మొదటి గేమ్ను 21-11 తేడాతో గెలుచుకున్నారు.
అయితే, మోకాలి గాయం కారణంగా యమగూచి ఆట నుంచి అర్ధాంతరంగా వైదొలగడంతో, పీవీ సింధు సునాయాసంగా సెమీస్లోకి ప్రవేశించారు.

