ఆపరేషన్ సిందూర్’తో చరిత్ర సృష్టించాం, పహల్గామ్ దాడికి ప్రతీకారం తీర్చుకున్నాం, శత్రువుకు తగిన బుద్ధి చెప్పాం అని తెలిపారు.
దేశ భద్రతకు హాని కలిగిస్తే సహించేది లేదు అమాయకులను చంపిన వారినే మట్టుబెట్టాం.
కచ్చితమైన సమాచారంతోనే ఉగ్రవాదులపై దాడి చేశాం పాక్ పౌరుల నివాసాలను టార్గెట్ చేయలేదు అని అన్నారు.
పౌరుల ప్రాణాలకు నష్టం లేకుండా ఉగ్రవాదులను మట్టుబెట్టాం. భద్రతా దళాలు చరిత్ర సృష్టించాయి అని తెలిపారు.
ధైర్యసాహసాలు ప్రదర్శించిన సైనికులకు అభినందనలు హనుమంతుని లంకా దహనమే మాకు ఆదర్శం అని అన్నారు.
సరిహద్దు రాష్ట్రాల్లో పూర్తి అప్రమత్తంగా ఉన్నాం సైనికులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చిన ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు.


ముస్లింలపై విరుచుకుపడటం తగదు..మోదీపై ఒవైసీ సంచలన వ్యాఖ్యలు