ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల్లో తెలుగు దేశం కూటమి ప్రభంజనం కొనసాగుతోంది. పలువురు మంత్రులతో పాటు హేమాహేమీల వంటి నేతలు ఓటమి దిశలో ఉన్నారు. మంత్రుల్లో ధర్మాన ప్రసాదరావు, సీదిరి అప్పలరాజు, బొత్స సత్యనారాయణ, పీడిక రాజన్నదొర, గుడివాడ అమర్నాథ్, దాడిశెట్టి రాజా, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, కొట్టు సత్యనారాయణ, అంబటి రాంబాబు, ఆదిమూలపు సురేశ్, ఆర్కే రోజా, బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి, విడదల రజనీ, మేరుగు నాగార్జున, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కాకాణి గోవర్ధన్రెడ్డి, ఉష శ్రీచరణ్ తదితరులు ఓట్ల వేటలో వెనుకబడి పోయారు.