telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

జేసీకి లోకేశ్ ధైర్యం చెబుతుంటే నవ్వస్తోంది: ఎంపీ గోరంట్ల

gorantla madhav ycp

టీడీపీ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డిపై హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ విమర్శలు గుప్పించారు. రాజకీయాల్లో ఎంతో అనుభవమున్న జేసీకి లోకేశ్ ధైర్యం చెబుతుంటే నవ్వస్తోందన్నారు. పక్కా ఆధారాలతో అరెస్ట్ లు జరిగితే, లోకేశ్ వారి కుటుంబాన్ని పరామర్శించడానికి రావడం విడ్డూరంగా అనిపిస్తోందని అన్నారు. ఓటమిపాలైన వ్యక్తి వచ్చి జేసీకి ధైర్యం చెప్పడం ఏంటని ప్రశ్నించారు. లోకేశ్ మాట్లాడుతున్న మాటలను విని చిన్న పిల్లలు జోక్ గా తీసుకుని నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు.

వైసీపీలోకి రావాలంటూ ప్రలోభాలకు గురిచేసినా అచ్చెన్నాయుడు లొంగలేదని, అందుకే ఆయన్ను అరెస్ట్ చేయించారని లోకేశ్ ఆరోపించడంపై మాధవ్ మండిపడ్డారు. 23 మంది ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లా కొన్న విషయం గుర్తులేదా? అంటూ ప్రశ్నించారు. జేసీ సోదరులు 6 వాహనాలకు మాత్రమే బీమా చేయించి, 151 వాహనాలకు నకిలీ ఇన్స్యూరెన్స్ పత్రాలను సృష్టించారని, ఈ విషయంలో అన్ని ఆధారాలూ పోలీసుల వద్ద ఉన్నాయని తెలిపారు.

Related posts