గిరిజా షెట్టర్ ఈ పేరు వింటేనే లెజండరీ దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన ‘గీతాంజలి’ మన మనసులో మెదులుతుంది. మొదటి సినిమా అయినా ఈ మూవీలో అద్భుతంగా నటించి ప్రేక్షకులు ఎప్పటికీ తనను గుర్తుపెట్టుకునేలా క్రేజ్ సంపాదించుకుంది గిరిజా. కాగా ఈ నెల 10న గీతాంజలి విడుదలై 31 సంవత్సరాలు పూర్తైన సందర్బంగా.. అప్పటి కొన్ని పేపర్ క్లిప్పింగ్స్ను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. మెమోరీస్ అంటూ ఆమె షేర్ చేసిన కొన్ని ఫొటోలు, పేపర్ క్లిప్పింగ్స్పై ఫ్యాన్స్ పలు కామెంట్లు పెడుతున్నారు. మీ నటన ఎప్పటికీ మర్చిపోలేమంటూ వారు తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు. “గీతాంజలి” తరువాత మరో ఐదు చిత్రాల్లో నటించిన ఈ హీరోయిన్.. అనూహ్యంగా సినిమా ఇండస్ట్రీకి దూరమైంది. ఇక ప్రస్తుతం లండన్లో రచయితగా, జర్నలిస్ట్గా, ఫిలాసఫర్గా గిరిజా రాణిస్తోంది.