telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు

తొమ్మిది నెలల పసిపాపపై అత్యాచారం కేసు : .. నిందితుడికి మరణశిక్ష ఖరారు..

hang as punishment to infant abusing

వరంగల్ ఫాస్ట్ ట్రాక్ కోర్టు తొమ్మిది నెలల పసిపాపపై అత్యాచారం చేసి హత్య చేసిన ఘటనలో మరణశిక్షను ఖరారు చేసింది. వరంగల్‌కు చెందిన తొమ్మిది నెలల చిన్నారిపై ప్రవీణ్ అనే వ్యక్తి అత్యాచారానికి పాల్పడటం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. ఈ కేసులో ప్రవీణ్ నేరం చేసినట్టు ఫాస్ట్ ట్రాక్ కోర్టు నిర్ధారించింది.

48 రోజుల క్రితం జరిగిన ఈ ఘటనపై ఇంత త్వరగా తీర్పును ప్రకటించడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారించి ఇంత త్వరగా తీర్పు ఇవ్వడం ఇదే మొదటి సారి. నిజానికి ఇతరత్రా కేసులతో పోలిస్తే ఇదే చాలా త్వరగా పూర్తిఅయింది. మిగిలినవి దశాబ్దాల బట్టి పెండింగ్ లోనే ఉన్నవి లక్షలు ఉన్నాయి.

Related posts