telugu navyamedia
ఆంధ్ర వార్తలు క్రైమ్ వార్తలు వార్తలు

జంట హత్యల కేసులో పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి బెయిల్ పిటిషన్‌ గురజాల కోర్టు తిరస్కరించింది

పల్నాడు జిల్లా గుండ్లపాడులో సంచలనం సృష్టించిన జంట హత్యల కేసులో నిందితుడిగా ఉన్న వైసీపీ నేత పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి బెయిల్ పిటిషన్‌ న్యాయస్థానం కొట్టివేసింది.

ఆయన దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్‌ను గురజాల కోర్టు సోమవారం కొట్టివేసింది. కేసు తీవ్రతను పరిగణనలోకి తీసుకుని బెయిల్ మంజూరు చేయలేమని న్యాయమూర్తి స్పష్టం చేశారు.

గతేడాది గుండ్లపాడుకు చెందిన జవిశెట్టి వెంకటేశ్వర్లు, ఆయన సోదరుడు కోటేశ్వరరావు హత్యకు గురయ్యారు.

తెలంగాణలోని హుజూర్‌నగర్‌లో ఒక వివాహానికి హాజరై బైక్‌పై తిరిగి వస్తుండగా, వెల్దుర్తి మండలం బొదిలవీడు సమీపంలో వారిని వాహనంతో ఢీకొట్టి హతమార్చారు.

ఈ హత్యల వెనుక పిన్నెల్లి సోదరుల ప్రమేయం ఉందని ఆరోపణలు రావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.

ఈ కేసులో పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి ఏ-7 నిందితుడిగా ఉన్నారు. ఆయన తరఫున దాఖలైన బెయిల్ పిటిషన్‌పై విచారణ జరిపిన గురజాల కోర్టు, కేసు పూర్వాపరాలను, గాంభీర్యాన్ని దృష్టిలో ఉంచుకొని బెయిల్‌ను తిరస్కరించింది.

 

Related posts