గ్రూపు-1 ప్రధాన పరీక్షలను (మెయిన్స్) నిర్వహించే తేదీలు ఖరారు అయ్యాయి. డిసెంబరు 12 నుంచి 23వ తేదీ వరకు ఈ పరీక్షలను నిర్వహించనున్నారు. మొత్తం 167 పోస్టులకు ఏడు విడతలుగా నిర్వహిస్తారు.
డిసెంబరు 12న తెలుగు పేపర్, 13న ఆంగ్లం, 15, 17, 19, 21, 23న పేపర్-1, 2, 3, 4, 5 పరీక్షలు ఉంటాయని ఏపీపీఎస్సీ కార్యదర్శి ఏకే మౌర్య ప్రకటనలో తెలిపారు.