telugu navyamedia
తెలంగాణ వార్తలు

బీజేపీ, టీఆర్ఎస్‌లకు జీహెచ్ఎంసీ భారీ ఫైన్‌..

*బీజేపీ ఫ్లెక్సీల‌పై జీహెచ్ ఎంసీ భారీ బాదుడు
*ఇప్ప‌టివ‌ర‌కు 20 ల‌క్ష‌ల‌పైగా జ‌రిమానా
*టీఆర్ ఎస్ ఫ్లెక్సీల‌కు 3 ల‌క్ష‌లు జ‌రిమానా
*ఈ రోజు వ‌చ్చిన ఫిర్యాదుల‌కు రేపు జ‌రిమాన విధిస్తామ‌న్న అధికారులు

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ బీజేపీ, టీఆర్ఎస్ కు భారీ జరిమానా విధించింది. బీజేపీకి రూ.20 లక్షలు, టీఆర్ఎస్ పార్టీకి రూ.3 లక్షల మేర జరిమానాలు విధించినట్లు జీహెచ్‌ఎంసీ అధికారులు వెల్లడించారు.

నిబంధనలకు విరుద్ధంగా నగరమంతా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతో ఈ జరిమానాను జీహెచ్ఎంసీ విధించింది. జీహెచ్ఎంసీ ట్విటర్ ఖాతాకు ఫ్లెక్సీలపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఈ రోజు వచ్చిన ఫిర్యాదులపై రేపు జరిమానాలు జారీ చేస్తామని జీహెచ్ఎంసీ ఎన్ఫోర్స్‌మెంట్ వెల్లడించింది.

బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా ఆ పార్టీ ఫ్లెక్సీలను ఏర్పాటు చేసింది. అదే సమయంలో విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా హైదరాబాద్ కు వస్తుండటంతో టీఆర్ఎస్ కూడా అదే స్థాయిలో ఫ్లెక్సీలను ఏర్పాటు చేసింది.

రెండు పార్టీలు నగరంలో అనేక రోడ్లలో ఫ్లెక్సీలను నిబంధనలకు విరుద్థంగా ఏర్పాటు చేశాయి. టీఆర్ఎస్-బీజేపీ పోటాపోటీ ఫ్లెక్సీలు, హోర్డింగులతో నగరమంతా గులాబీ, కాషామయంగా కనిపిస్తోంది. దీంతో జీహెచ్ఎంసీ రెండు పార్టీలకు భారీ జరిమానా విధించింది

Related posts