telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఇంకొన్ని రోజులు మాత్రమే… మంచి రోజులు వచ్చేస్తాయి… : గీత మాధురి

Geetha-Madhuri

క‌రోనా మ‌హమ్మారి రోజురోజుకి విజృంభిస్తోంది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా క‌రోనా నివార‌ణ‌కు అన్ని దేశ ప్ర‌భుత్వాలు, ప్ర‌జ‌లు త‌గు చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా క‌రోనా ప్ర‌భావం తీవ్రంగా ఉంది. ఈ సందర్భంగా సింగర్ గీతా మాధురి ఓ వీడియో ద్వారా సందేశమిచ్చారు. ‘‘హాయ్.. అందరికీ నమస్కారం. అందరూ ఇంటిపట్టునే ఉండండి.. సురక్షితంగా ఉండండి. నేను ఇంటిలోనే ఉంటున్నాను. మీరు కూడా ఇంటిలోనే ఉండండి. ఏవైనా అవసరాల కోసం బయటికి వెళ్లినప్పుడు ఒకేసారి అన్నీ తెచ్చుకోండి. అవి తెచ్చుకునేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండండి. అన్నీ, పాల ప్యాకెట్లతో సహా అన్నీ శానిటైజ్ చేయండి. చేతులు కూడా ఎప్పటి కప్పుడు శానిటైజర్‌తో క్లీన్ చేసుకోండి. అస్తమానం చేతులని నోటి దగ్గర, ముక్కు, కళ్ల దగ్గర పెట్టుకోకండి. మనం ఇంట్లో ఉంటూ కూడా మనల్ని కాపాడుకోవడమే కాకుండా.. అందరినీ కాపాడుకునే అవకాశం దక్కింది. ఇంకొన్ని రోజులు ఓపిక పడితే.. ప్రస్తుత పరిస్థితులన్నీ చక్కబడతాయి. అందరూ సుఖంగా ఉండే రోజులు మళ్లీ వచ్చేస్తాయి. దయచేసి అందరూ ఇంట్లోనే ఉండండి..’’ అని గీతామాధురి తెలిపారు.

Related posts