*స్వగ్రామం బ్రాహ్మణపల్లికి చేరుకున్న మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి అంతిమయాత్ర
*భౌతికకాయాన్ని చూసి కన్నీటి పర్యంతమైన గ్రామస్థులు
*పుష్పాంజలి ఘటించి ఘననివాళులు అర్పించిన గ్రామస్థులు
*కాసేపట్లో మేకపాటి ఇంజనీరింగ్ కళాశాల వద్ద గౌతమ్రెడ్డి అంత్యక్రియలు
ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అంతిమయాత్ర స్వగ్రామం బ్రాహ్మణపల్లికి చేరుకుంది. నెల్లూరులోని ఆయన నివాసం నుంచి ప్రారంభమైన అంతిమయాత్ర జొన్నవాడ, బుచ్చి, సంగం, నెల్లూరుపాలెం, మర్రిపాడు, బ్రహ్మణపల్లి, నందిపాడు మీదుగా ఉదయగిరికి చేరుకుంది.
ఈ యాత్రలో ఆయన బంధువులు, అభిమానులు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. యాత్ర పొడవునా ప్రజలు, అభిమానులు కన్నీటితో వీడ్కోలు పలికారు. ఉదయగిరిలోని మేకపాటి ఇంజినీరింగ్ కళాశాల సమీపంలో గౌతమ్రెడ్డి అంత్యక్రియలు జరుగుతున్నాయి.
మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అంత్యక్రియల్లో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉదయగిరి చేరుకున్నారు.


చంద్రబాబును మార్షల్స్ అడ్డుకోవడం దారుణం: నక్కా ఆనంద్ బాబు