ఏపీ మైనారిటీ సంక్షేమ శాఖామంత్రి ఎన్ఎమ్డీ ఫరూక్ ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరామర్శించారు.
హైదరాబాద్లో శనివారం సీఎం చంద్రబాబు ఫరూక్ ఇంటికెళ్లారు.
ఇటీవల ఫరూక్ సతీమణి షెహనాజ్ అనారోగ్యంతో మృతి చెందారు.
ఈ నేపథ్యంలో వారి నివాసానికి వెళ్లి ఫరూక్, కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు.
పరామర్శించిన వారిలో టీడీపీ ఎమ్మెల్యేలు, నేతలు ఉన్నారు.