telugu navyamedia
తెలంగాణ వార్తలు

నామినేటెడ్ పదవులతో నయా జోష్..

తెలంగాణలో కొత్తగా ఐదు కార్పొరేషన్లకు ఛైర్మన్లను ప్రకటించారు. ఇవాళ తెలంగాణ భవన్లో ప్రజాప్రతినిధులతో సమావేశం కానున్న నేపథ్యంలో ఎమ్మెల్సీ పదవులను ఆశించిన వారికి నామినేటెడ్ పదవులతో సంతృప్త పరచారు.కొత్త కార్పొరేషన్లకు ఛైర్మన్ల నియామకంతో టీఆర్ఎస్ శ్రేణుల్లో కొత్త జోష్ నింపారని చెప్పొచ్చు.

తెలంగాణ ఉమెన్స్ ఫైనాన్స్ కార్పొరేషన్” చైర్మన్ గా మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత, తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్” చైర్మన్ గా గజ్జెల నగేష్, తెలంగాణ స్టేట్ టెక్నాలజికల్ సర్వీసెస్” చైర్మన్ గా పాటిమీది జగన్ మోహన్ రావు, తెలంగాణ సాహిత్య అకాడమీ” చైర్మన్ గా జూలూరి గౌరీశంకర్, తెలంగాణ షీప్ అండ్ గోట్ డెవలప్మెంట్ కార్పొరేషన్” చైర్మన్ గా దూదిమెట్ల బాలరాజు యాదవ్, అన్ని సామాజిక వర్గాలను బేరీజువేసి ఛైర్మన్ల నియామకంలో జాగ్రత్త వహించారని తెలుస్తోంది.

Related posts