వికారాబాద్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్న తండ్రే కుమార్తె జీవితాన్ని నాశనం చేశాడు. ఇంట్లో ఎవరికి తెలియకుండా ఆమెపై అత్యాచారానికి పాల్పడి గర్భవతిని చేశాడు..
వివరాలలోకి వెళితే..
మోమిన్ పేట నుంచి బతుకుదేరువుకోసం వచ్చిన ఒక వ్యక్తి కుటుంబంతో సహా హైదరాబాద్ లో పఠాన్ చెరువు ప్రాంతంలో నివాసముంటున్నాడు. అతనికి ముగ్గురు కూతుళ్లు.
కస్తూర్బాలో చదువుకుంటున్న 15 ఏళ్ల బాలిక లాక్డౌన్ కారణంగా ఇంటికి వచ్చింది. అప్పటి నుంచి ఇంట్లోనే ఉంది. తండ్రి మధ్యాహ్న భోజనానికి ఇంటికి వచ్చేవాడు. ఈ క్రమంలో ఒంటరిగా ఉన్న కూతురును బెదిరించి మూడు నెలలుగా లైంగిక దాడికి పాల్పడుతున్నాడు. అలా మూడు నెలలుగా ఆమెపై లైంగిక దాడికి పాల్పడుతున్నాడు.
కూతురు నీరసంగా ఉండటాన్ని గమనించిన తల్లి మోమిన్పేట ఆస్పత్రికి తరలించగా.. ఆమె మూడు నెలల గర్భవతి అని వైద్యులు తెలిపారు. ఆ విషయంపై తల్లి కూతుర్ని నిలదీయగా.. తన గర్భానికి కారణం కన్నతండ్రే అని చెప్పగా షాక్కు గురైంది.
ఈ విషయం బయటికి చెప్తే చంపేస్తానని బెదిరించాడని, గత కొంతకాలంగా తండ్రి వేధింపులు తట్టుకోలేకపోతున్నట్లు చెప్పింది. దీంతో తల్లి, కూతుళ్లను తీసుకొని సొంత గ్రామం మోమిన్ పేటకు చేరుకొని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై కేసునమోదు చేసుకొన్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
.