ఎన్నికల తేదీ దగ్గర పడుతున్న తరుణంలో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు ఆయా పార్టీలు నానా తంటాలు పడుతున్నాయి. కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గ ఓటర్లను ఆకట్టుకునేందుకు వైసీపీ నాయకులు క్యాలెండర్, స్టిక్కర్, బ్యాడ్జీతో కూడిన బ్యాగులను పంచుతూ పట్టుబడ్డారు. స్థానిక రాఘవేంద్రనగర్లో ఆదివారం వైసీపీ కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి ఒక బ్యాగు ఇస్తూ ప్రచారాన్ని మొదలుపెట్టారు. విషయం తెలుసుకున్న ఫ్లయిం గ్ స్క్వాడ్ అధికారులు అక్కడికి చేరుకోవడంతో వైసీపీ కార్యకర్తలు పరారయ్యారు. అనంతరం అధికారులు, పోలీసులు వైసీపీ కార్యకర్త పవన్ కుమార్ ఇంట్లో సోదాలు నిర్వహించారు. అక్కడే ఏడు పెట్టెల్లో దాచి ఉంచిన 700 బ్యాగులను స్వాధీనం చేసుకున్నారు.
previous post