వేలూరు జిల్లా కాట్పాడిలో భారీగా నగదు పట్టుబడింది. ఎన్నికల సంఘం ఫ్లయింగ్ స్క్వాడ్ తనిఖీలలో భాగంగా జిల్లాలో ఈ నగదు పట్టుబడినట్టు తెలుస్తుంది. దాదాపు 100 కోట్లు పట్టుబడినట్టు అధికారులు తెలిపారు. ఈ నగదు అంతా వేలూరు డీఎంకే నేతల కు చెందినది అని తేలటంతో, వారి ఇళ్లలో ఐటీ సోదాలు జరుగుతున్నాయి.
ఎన్నికల సందర్భంగా దేశవ్యాప్తంగా ఈసీ తనిఖీలు చేపడుతున్న విషయం తెలిసిందే. అయితే నేతలు మాత్రం అధికారుల కళ్ళు గప్పి ఇష్టానుసారంగా నగదు, మద్యం విచ్చలవిడిగా ఓటర్లకు ఎర వేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తమిళనాడులో ఇంత భారీగా నగదు దొరికినట్టు తెలుస్తుంది. దానికి సంబందించిన వ్యక్తులను ఈసీ అధికారులు అదుపులోకి తీసుకొన్నారు. ఆ పార్టీ నేతల ఇంట్లో తనిఖీలు కూడా చేపడుతున్నారు.
ఎట్టిపరిస్థితుల్లో అవినీతిని సహించను: సీఎం జగన్