జనసేన అధినేత పవన్ కల్యాణ్ అక్టోబరు 5 విజయదశమి రోజున తిరుపతి నుంచి పర్యటన చేయనున్నారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ఈ మేరకు ఎనిమిది బ్లాక్ కలర్ స్కార్పియో కార్లుజనసేన కేంద్ర కార్యాలయానికి చేరుకున్నాయి. పవన్ పర్యటనకు ఈ వాహనాలను వినియోగించనున్నారు. వీటికి పూజా కార్యక్రమాలు చేసిన తర్వాత పవన్ కల్యాణ్ ప్రారంభిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి.
వైకాపా ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించేందుకు పవన్ నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. దసరా రోజున ప్రారంభించి ఆరు నెలల్లో ఏపీ అంతటా పర్యటించటంతో పాటు, ప్రతి ఉమ్మడి జిల్లాలోనూ బహిరంగసభలు నిర్వహించనున్నట్టు జనసేన నేతలు పేర్కొన్నారు. అన్ని నియోజకవర్గాల్లోనూ పర్యటనలు ఉండేలా రూట్మ్యాప్ రూపొందిస్తున్నారు.
వచ్చే ఏడాది మార్చి, ఏప్రిల్లోనే ఎన్నికలు ఉంటాయనే సంకేతాలు వస్తున్నందున ఆయన స్పీడ్ పెంచారు. ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు పెద్దగా సమయం లేదని, ఇప్పటి నుంచే నాయకులు సన్నద్ధం కావాలనేది పవన్ అభిప్రాయం. ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ఇప్పటికే ఆయన పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. అందులో భాగంగా ఏపీ పర్యటనకు సిద్ధమయ్యారు.


బాబు పాలనలో వ్యవస్ధలన్నీ నిర్వీర్యం: లక్ష్మీపార్వతి