*జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసు… సీన్ రీకన్స్ట్రక్షన్ ముగిసింది.
*ఏ-1 నిందితుడు సాదుద్దీన్ ముగిసిన కస్టడీ విచారణ
*మూడో రోజు ముగిసిన మైనర్లకు విచారణ..
* జువైనల్ హోంకు మైనర్లకు తరలింపు..
జూబ్లీహిల్స్ బాలికపై జరిగిన గ్యాంగ్ రేప్ కేసులో పోలీసుల విచారణ వేగవేంతం చేశారు.. ఈ కేసులో నిందితుల మూడో రోజు కస్టడీ ముగిసింది. కస్టడీ ముగిసిన అనంతరం మైనర్లను జువైనల్ హోమ్కు తరలించారు. రేపు ఉదయం మైనర్లను మరోసారి కస్టడీకి తీసుకోనున్నారు.
అంతకుముందు ఈ కేసు విచారణలో భాగంగా ఇవాళ ఐదుగురు మైనర్లను పోలీసులు సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు. జువైనల్ హోమ్ డ్రెస్ కోడ్తో క్రైమ్ సీన్కి నిందితులను పోలీసులు తీసుకెళ్లారు. ఈ క్రమంలోనే నిందితులను పెద్దమ్మ తల్లి దేవాలయం సమీపంలోని నిర్మానుష్య ప్రదేశం, కేబీఆర్ పార్క్, బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 14లోని కన్సూ బేకరి వద్ద సీన్ రీ-కన్స్ట్రక్షన్ నిర్వహించారు. జూబ్లీహిల్స్ రోడ్ 36, 44లలోనూ పరిశీలించారు.
ఏ1 నిందితుడు సాదుద్దీన్తో కలిపి మైనర్లను పోలీసులు ప్రశ్నించారు. ఈనెల 10న సాదుద్దీన్ను కస్టడీలోకి తీసుకున్న పోలీసులు.. బాలిక అత్యాచారానికి సంబంధించి పలు కీలక వివరాలు తెలుసుకున్నారు. మరోవైపు ఇవాళ్టితో సాదుద్దీన్ కస్టడీ గడువు ముగిసింది.
గుళ్లు,గోపురాలకు తిరగడానికే గవర్నర్: వీహెచ్