టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి మృతిపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం ప్రకటించారు. ఓమంచి సహచరుడిని , ఆత్మీయ మిత్రుడ్ని కోల్పోయానని విచారం వ్యక్తం చేస్తారు. బొజ్జల కుటుంబ సభ్యులకు ఆయన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
అంతే కాదు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అనారోగ్యంతో బాధపడుతున్న బొజ్జలను స్వయంగా ఆయన ఇంటికి వెళ్లి కలిశారు.ఆ సమయంలో బొజ్జల గోపాలకృష్ణను పరామర్శించి..ఆయనకు జ్ఞాపికను అందజేసిన సందర్భాన్ని ఈసందర్భంగా గుర్తు చేసుకున్నారు కేసీఆర్. అలాగే బొజ్జల ఆరోగ్యంపై కుటుంబ సభ్యులతో మాట్లాడిన వీడియోని సైతం అందరితో పంచుకున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి.
టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావానికి ముందు కేసీఆర్ కూడా టీడీపీలో కొనసాగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పార్టీకి చెందిన పలువురు కీలక నేతలతో కేసీఆర్ అత్యంత సన్నిహితంగా మెలిగేవారు. అలాంటి నేతల్లో బొజ్జల కూడా ఒకరు. ఈ కారణంగానే బొజ్జల మృతి వార్త తెలిసిన వెంటనే అత్యంత ఆత్మీయుడిని కోల్పోయానంటూ కేసీఆర్ సంతాపం ప్రకటించారు. టీఆర్ఎస్ ఆవిర్భావం సమయంలో టీడీపీ తరఫున కేసీఆర్ని బొజ్జల బుజ్జగించిన సంగతి తెలిసిందే.
సీపీఐ, సీపీఎంలు పార్టీ సిద్ధాంతాలను అమ్ముకున్నాయి: బీజేపీ నేత