telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

పాస్టర్లకు క్రైస్తవ సంస్థల నుంచి జీతాలివ్వాలి: బీజేపీ నేత సోము వీర్రాజు

Somu-Veerraju bjp

పాస్టర్లకు క్రైస్తవ సంస్థల ఆస్తుల నుండి వేతనాలు ఇవ్వాలని బీజేపీ నేత సోము వీర్రాజు డిమాండ్ చేశారు. పాస్టర్లకు, ఇమామ్ లకు ప్రజాధనంతో వేతనాలు ఇవ్వాలని సీఎం జగన్ భావించడం తగదని అన్నారు. విజయనగరంలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎండోమెంట్ శాఖ, హిందూ దేవాలయాల ఆస్తుల నుంచి పూజార్లకు జీతభత్యాలను ఇస్తున్నప్పుడు, ప్రజాధనంతో పాస్టర్లకు వేతనాలు ఎలా ఇస్తారని జగన్ ను ప్రశ్నించారు.

ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డు గురించి ఆయన ప్రస్తావించారు. టీటీడీ బోర్డును రాజకీయాలకు దూరంగా వుంచాలని అన్నారు. చైర్మన్లుగా మఠాధిపతులను నియమించాలని డిమాండ్ చేశారు. టీటీడీని గత ప్రభుత్వాలు రాజకీయమయం చేశాయని, ఇప్పుడు జగన్ కూడా అదేవిధంగా చేస్తున్నారని దుయ్యబట్టారు.

Related posts