telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

రాజధాని గ్రామాల్లో ఉద్రిక్తత..మహిళలపై పోలీసుల లాఠీఛార్జ్

amaravathi ap

ఏపీ రాజధాని గ్రామాల్లో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. మందడం, తుళ్లూరు గ్రామాల్లోని పరిస్థితి మరింత ఉద్రిక్తంగా ఉంది. విజయవాడ కనకదుర్గమ్మకు సారె, నైవేద్యం సమర్పించేందుకు పాదయాత్రకు వెళ్లేందుకు సద్ధమైన మహిళలు, రైతులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు గ్రామస్తుల మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది. పోలీసులు లాఠీలకు పని కల్పించారు. పలువురు మహిళలకు గాయాలయ్యాయి.

మహిళల చేతిలోని అమ్మవారి చిత్రపటాలను కూడా పోలీసులు లాక్కున్నారు. ఈ క్రమంలో పోలీసుల వలయాన్ని దాటుకునే వారంతా ముందుకు కదులుతున్నారు. పోలీసుల తీరుపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము ఏపీలో ఉన్నామా? లేక పాకిస్థాన్ లో ఉన్నామా? అని ప్రశ్నించారు. రాజధానికి స్వచ్ఛందంగా భూములను ఇచ్చిన తమను శిక్షిస్తారా? అని మండిపడ్డారు. మహిళలు అని కూడా చూడకుండా లాఠీఛార్జి చేశారని మండిపడ్డారు.

Related posts