ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు.
ఈ పర్యటనలో భాగంగా మండపేట నియోజకవర్గంలోని రాయవరం గ్రామంలో నిర్వహించే రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో సీఎం పాల్గొననున్నారు.
రైతుల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకోవడం, వారి సూచనలు వినడం ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యంగా ఉంది.
అనంతరం, రాజముద్రతో కొత్తగా వచ్చిన పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేస్తారు. సీఎం పర్యటన నిమిత్తం రాయవరంలో భారీగా ఏర్పాట్లు చేశారు.
మధ్యాహ్నం రెండు గంటలకు టీడీపీ కార్యకర్తలతో సమావేశం కానున్నారు.

