తెలంగాణలో కరోనా విలయం కొనసాగుతూనే ఉంది. రోజు రోజుకు రికార్డు స్థాయిలో కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో కరోనా కేసులు 2.7 లక్షలు దాటాయి కరోనా కేసులు. అయితే… ఇవాళ రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య కాస్త తగ్గింది. తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో 612 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అలాగే ఇక 24 గంటల్లో ముగ్గురు కరోనాతో మృతి చెందారు. దీంతో.. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,76,516 కి చేరుకుంది. ఇక ఇప్పటి వరకు కరోనా బారినపడి 2,67,427 మంది కోలుకున్నారు. తాజా మరణాలతో తెలంగాణ రాష్త్రంలో మొత్తం 1485 మంది మృతి చెందారు. దేశవ్యాప్తంగా కరోనా మరణాల రేటు 1.5 శాతంగా ఉంటే.. రాష్ట్రంలో 0.53 శాతానికి పడిపోయిందని.. రికవరీ రేటు దేశంలో 94.84 శాతంగా ఉంటే.. స్టేట్లో 96.67 శాతానికి పెరిగిందని బులెటిన్లో పేర్కొంది సర్కార్. ఇక, ప్రస్తుతం 7,604 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో తెలంగాణ వ్యాప్తంగా 56,178 పైగా కరోనా పరీక్షలు నిర్వహించగా.. మొత్తం టెస్టుల సంఖ్య 60,29,209 కు చేరుకుంది.
previous post
రాహుల్, ప్రియాంకలు చాలా కష్టపడ్డారు: శివసేన