telugu navyamedia
CBN ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

చీపురుపల్లిలో బాలికలకు అందించే హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు

విజయనగరం జిల్లా, చీపురుపల్లి నియోజకవర్గంలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నేడు పర్యటించారు.

చీపురుపల్లిలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో రాష్ట్ర వ్యాప్తంగా 14 ఏళ్ల వయసు బాలికలకు అందించే హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా విద్యార్థినులతో సీఎం ముచ్చటించారు. అనంతరం ఆసుపత్రి ప్రాంగణాన్ని పరిశీలించి పరిశుభ్రతపై ఆదేశాలు ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో మంత్రులు సత్యకుమార్ యాదవ్, శ్రీమతి వంగలపూడి అనిత, శ్రీ కొండపల్లి శ్రీనివాస్, పార్లమెంటు సభ్యుడు శ్రీ అప్పలనాయుడు, ఎమ్మెల్యే శ్రీ కిమిడి కళా వెంకట్రావు, కలెక్టర్, వైద్యారోగ్య శాఖ అధికారులు పాల్గొన్నారు.

Related posts