విజయనగరం జిల్లా, చీపురుపల్లి నియోజకవర్గంలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నేడు పర్యటించారు.
చీపురుపల్లిలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో రాష్ట్ర వ్యాప్తంగా 14 ఏళ్ల వయసు బాలికలకు అందించే హెచ్పీవీ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా విద్యార్థినులతో సీఎం ముచ్చటించారు. అనంతరం ఆసుపత్రి ప్రాంగణాన్ని పరిశీలించి పరిశుభ్రతపై ఆదేశాలు ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో మంత్రులు సత్యకుమార్ యాదవ్, శ్రీమతి వంగలపూడి అనిత, శ్రీ కొండపల్లి శ్రీనివాస్, పార్లమెంటు సభ్యుడు శ్రీ అప్పలనాయుడు, ఎమ్మెల్యే శ్రీ కిమిడి కళా వెంకట్రావు, కలెక్టర్, వైద్యారోగ్య శాఖ అధికారులు పాల్గొన్నారు.


ఏపీలో ప్రతిపక్షం చేతులెత్తేసింది…