కలిసి కుప్పం నియోజకవర్గం, శాంతిపురం మండలం, శివపురంలోని నివాసం నుంచి తూంసీ వద్ద ప్రజావేదిక సభలో సీఎం చంద్రబాబు ప్రసంగించారు.
కుప్పంలో 5,555 ఈ- సైకిళ్లు పంపిణీ చేసి చరిత్ర సృష్టించాంరు. గిన్నిస్ రికార్డు వచ్చిందని కాదు రాబోయే రోజుల్లో మరిన్ని ప్రయోజనాలు. నూతన చరిత్రకు కుప్పం నుంచి శ్రీకారం చుట్టాం, ఇంటిపై ఉత్పత్తయ్యే విద్యుత్ తోనే సైకిల్కు ఛార్జింగ్ చేసుకోవచ్చు అన్నారు.
ఈ సూపర్ సైకిల్ ఒక్క పైసా ఖర్చు లేకుండా ఎక్కడికైనా దూసుకెళ్తుంది. సైకిల్కు ఓటు వేశారు అభివృద్ధి అంటే ఏమిటో చేసి చూపించాం. తప్పులు చేసిన వాళ్లకు నిద్ర రాదు వాళ్లు చేసిన తప్పులే వెంటాడుతుంటాయి అన్నారు.
నిద్ర చాలా ముఖ్యం మంచి చేస్తే సుఖంగా నిద్రపడుతుంది. శరీరానికి కొంత వ్యాయామం కూడా అవసరం అన్నారు.
నేను ఎప్పటికప్పుడు కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉంటాను అనునిత్యం నూతన ఆలోచనలు, ఆవిష్కరణలు చేస్తుంటాను రాష్ట్ర ఆదాయం పెరగాలి పేదవాళ్లకు అందాలి పేదవాళ్ల జీవన ప్రమాణాలు పెరిగి ఆనందంగా ఉండాలి అని చంద్రబాబు అన్నారు .
ఒక సంకల్పంతో సూపర్ సిక్స్ ను సూపర్ హిట్ చేశాం ఎంతమంది పిల్లలున్నా తల్లికి వందనం ఇస్తున్నాం.
ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాం శారీరక వ్యాయామం కోసం ఈ-సైకిల్ వినియోగించాలి ఈ-సైకిళ్ల ద్వారా పర్యావరణం మెరుగుపడుతుంది ఈ-సైకిల్ తొక్కడం చాలా సంతోషంగా ఉంది అన్నారు.
వీలైనంత వరకు పేదలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు చర్యలు సూపర్ సిక్స్ కార్యక్రమం ఇందులో భాగమే.
అనంతపురం జిల్లాను హార్టికల్చర్ హబ్గా అభివృద్ధి చేశాం, హంద్రీనీవా పూర్తిచేశాం అనంతపురానికి నీళ్లు తెచ్చాం అన్ని చెరువులు నింపి భూగర్భ జలాశయంగా మారుస్తాం అన్నారు.
సంజీవని ప్రాజెక్టు కుప్పంలో ప్రారంభించాం, అందరి ఆరోగ్యాన్ని కాపాడేందుకు సంజీవని తీసుకొచ్చాం, మెరుగైన వైద్య సౌకర్యాలు కల్పించే బాధ్యత మాది అన్నారు.
రాష్ట్రం మొత్తం సంజీవని ప్రాజెక్టును జయప్రదం చేస్తాం. వైసీపీ హయాంలో ఏపీని ధ్వంసం చేశారు.
భూ రీసర్వేతో గత పాలకులు సమస్యలను సృష్టించారు వైసీపీ తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్టును రద్దు చేశాం అని సీఎం చంద్రబాబు ప్రసంగించారు.

