ఏపీలో మాన్సాస్ ట్రస్టు వివాదంపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. పార్టీ సీనియర్ నేత అశోక్ గజపతిరాజును ట్రస్టు చైర్మన్ పదవి నుంచి తొలగించడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. మాన్సాస్ ట్రస్టులో ప్రభుత్వం ఎలా జోక్యం చేసుకుంటుందని ప్రశ్నించారు.
అశోక్ గజపతిరాజు వంటి వ్యక్తిని ఇబ్బందిపెడతారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది మాన్సాస్ ట్రస్టు ఆస్తులను కొట్టేసే ప్రయత్నమని చంద్రబాబు ఆరోపించారు. ధర్మకర్తల మండలిలో అన్యమతస్తులను ఎలా నియమిస్తారని ప్రశ్నించారు.


అపవిత్ర కూటమికి.. అవినీతి సర్కార్ కు ముగింపు: బీజేపీ