telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

‘ఇది ప్రజాస్వామ్య దేశం జగన్ అన్నా’: కేశినేని తీవ్ర వ్యాఖ్యలు

kesineni nani tdp

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలను ఎన్నికల సంఘం వాయిదా వేయడంపై సీఎం జగన్ తో పాటు వైసీపీ నేతలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. చంద్రబాబు సూచనల మేరకే రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఎన్నికలను వాయిదా వేశారంటూ జగన్ తీవ్ర ఆరోపణలు చేశారు.

ఈ నేపథ్యంలో టీడీపీ ఎంపీ కేశినేని నాని ఘాటుగా స్పందించారు. ఇది ప్రజాస్వామ్య దేశం జగన్ అన్నా’ అని కేశినేని నాని అన్నారు. రాష్ట్రాన్ని నియంతలా పాలిద్దామంటే కుదరదని చెప్పారు. మీరు సీఎం అయినంత మాత్రాన… అన్నీ మీరు అనుకున్నట్టుగా జరగవని, ప్రతి దానికి ఒక పద్ధతి ఉంటుందని అన్నారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ ద్వారా తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

Related posts