telugu navyamedia
క్రైమ్ వార్తలు

పెళ్లి ఇంట్లో విషాదం.. వధువు, తండ్రి మృతి

నిర్మల్‌ జిల్లాలో పెళ్లి ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. కడెం మండలం పండవపూర్ సమీపంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నవ వధువు, కుటుంబ సభ్యులుప్రయాణిస్తున్న ఓ కారు అదువు తప్పి లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో నవ వధువు మౌనికతో పాటు ఆమె తండ్రి రాజయ్య మృతి చెందారు.

కడెం మండలంమద్దిపడగా గ్రామానికి చెందిన మౌనిక కు, మహారాష్ట్ర, బల్లర్ష రాజురా గ్రామానికి చెందిన వ్యక్తితో ఈనెల 25 తేదీన వివాహం నిన్న మహారాష్ట్ర బల్లర్శలో రిసెప్షన్ ముగించుకొనివస్తుండగా ఈ ప్రమాదానికి జరిగినట్లు తెలుస్తోంది.

మృతులు కడెం మండలం మద్దిపడగ గ్రామానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ఈ ప్రమాదంలో ఇద్దరు మరణించగా పలవురికి గాయాలు అయినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టినట్లు పేర్కొన్నారు.

Related posts