telugu navyamedia
క్రైమ్ వార్తలు తెలంగాణ వార్తలు వార్తలు

కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ హత్య…

కూకట్‌పల్లి పోలీసు స్టేషన్ పరిధిలోని ప్రకాష్ నగర్ లో కృష్ణ అనే వ్యక్తిని‌ గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసారు. మహబూబ్ నగర్ కొల్లాపూర్ పండ్లవెల్లి గ్రామానికి చెందిన ఆంజనేయులు కుమారుడు కృష్ణ కూకట్‌పల్లి ప్రకాష్ నగర్ లో నివాసం ఉంటున్నాడు. మరుగుజ్జు అయిన కృష్ణ స్థానికంగా విద్యార్థులకు ట్యూషన్ లు చెప్పటమే కాకుండా, పూల వ్యాపారం చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. కాగా ఈ రోజు మధ్యాహ్నం కూకట్‌పల్లి నల్లచెరువులో ప్లాస్టిక్ సంచిలో మృతదేహం ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందటంతో, అక్కడికి చేరుకొని చూడగా స్థానికులు హత్యకు గురైనది కృష్ణ అని గుర్తించారు. ప్రకాష్ నగర్ లోని మృతుడి ఇంటికి చేరుకున్న పోలీసులకు ఇంటి ఎదుట రక్తపు మరకలు కనిపించటంతో, కృష్ణను అతడి ఇంటి వద్దనే హత్య చేసి సంచిలో మూటకట్టి చెరువులో పారవేసారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు హంతకుల కోసం గాలిస్తున్నారు. మృతుడికి ఎవరితో గొడవలు లేవని, హత్య ఎవరు ఎందుకు చేసారనేది తెలియటం లేదని మృతుని బంధువులు తెలిపారు.

Related posts