ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా, కూటమికి చెందిన మహిళా ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని అసెంబ్లీలోని ఆయన ఛాంబర్లో మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రితో వివిధ అంశాలపై చర్చించి, తమ నియోజకవర్గాల్లోని సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు.
రాష్ట్ర ప్రగతిలో మహిళా ప్రజాప్రతినిధుల పాత్ర కీలకమని, ప్రజాసేవలో వారు మరింత చురుగ్గా పాల్గొనాలని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా సూచించారు.
అసెంబ్లీ సమావేశాల్లో చురుగ్గా పాల్గొనాలని, సబ్జెక్టుపై అవగాహనతో మాట్లాడాలని ఇప్పటికే ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు.
టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ఐక్యంగా ముందుకు సాగాలని, రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి ఉండాలని ఆయన పునరుద్ఘాటించారు.


రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోంది..