telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

మొక్కజొన్న రైతులను ఆదుకోవాలని గన్‌పార్క్‌ వద్ద బీఆర్‌ఎస్ ఆందోళన

గన్‌పార్క్‌ వద్ద బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కేటీఆర్, హరీశ్ రావు, ఎమ్మెల్సీ శ్రవణ్, ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగారు. మొక్కజొన్న రైతులను ఆదుకోవాలని నినాదాలు చేశారు.

మార్కెట్లకు పోటెత్తిన మొక్కజొన్నలను కొనుగోలు చేయకపోవడంతో రైతన్నకు తిప్పలు అంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ బీఆర్‌ఎస్ నేతలు నినాదాలు చేశారు.

మొక్కజొన్నలతో గన్‌పార్క్‌లో నినాదాలు చేసిన బీఆర్‌ఎస్ పార్టీ నేతలు అక్కడి నుంచి కాలినడకన అసెంబ్లీకి బయలుదేరి వెళ్లారు.

గన్‌పార్క్ వద్ద మాజీ మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ 8 లక్షల ఎకరాల్లో రైతులు మొక్కజొన్నలను పండించారని, మద్దతు ధర లేకపోవడంతో పాటు వర్షాల కారణంగా అన్నదాతలు నష్టపోతున్నారని తెలిపారు.

25 శాతం పంట దళారుల చేతికి వెళ్లిందని అన్నారు. పంటల బీమా అమలు చేయడం లేదని విమర్శించారు.

వడగండ్ల వానతో రైతులు నష్టపోయారన్నారు. ఇన్‌పుట్ సబ్సిడీ ఇవ్వడం లేదని వెంటనే ఇవ్వాలన్నారు.

రూ.2400 మద్దతు ధర రూ.500 బోనస్ వెంటనే ప్రభుత్వం చెల్లించాలని మాజీ మంత్రి హరీశ్ రావు డిమాండ్ చేశారు.

Related posts