హైదరాబాద్ యువకుడు అబ్దుల్ వహాబ్ పొట్టకూటికోసం దుబాయ్ వెళ్లి పనిచేసుకుంటున్నాడు. తాజాగా అబ్దుల్ అదృశ్యం అవడం కలకలం రేపింది. గత ఎనిమిది నెలులుగా తమ కుమారుడి ఆచూకీ తెలియరావడం లేదంటూ ఆయన తండ్రి మహమ్మద్ అబ్దుల్ ఘనీ కన్నీరు పెట్టుకున్నాడు. తన కుమారుడిని ఆచూకీ చెప్పాల్సిందిగా విదేశీ మంత్రిత్వ శాఖ సాయాన్ని అర్థించాడు. గత ఎనిమిది నెలలుగా వహాబ్ నుంచి ఎటువంటి సమాచారం లేదని, తాము అతడిని సంప్రదించేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయని అబ్దుల్ ఘనీ పేర్కొన్నాడు.
కుమారుడి ఆచూకీ తెలియకపోవడంతో ఆందోళనగా ఉందన్నారు. ఎంబీటీ నేత అమ్జదుల్లాఖాన్ సాయంతో విదేశాంగ శాఖకు సోషల్ మీడియా ద్వారా చేసిన అభ్యర్థనకు ఆ శాఖ స్పందించింది. వహాబ్ ఆచూకీ తెలుసుకోవాల్సిందిగా దుబాయ్లోని భారత రాయబార కార్యాలయాన్ని ఆదేశించింది.