తిరుమలలో దర్శనం పూర్తి చేసుకున్న తర్వాత బయటికి వచ్చిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.
మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ-తెలంగాణ సంబంధాలపై మాట్లాడారు.
ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎంను కలుస్తానని వెల్లడించారు. రెండు ప్రభుత్వాలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని రేవంత్ తెలిపారు.
రెండు ప్రభుత్వాలు పరస్పరం సహకరించుకోవాలన్నారు. తద్వారా కొత్త ప్రభుత్వానికి సానుకూల సంకేతాలు పంపారు.
అలాగే తిరుమలలో తెలంగాణ తరపున సత్రం, కళ్యాణమండపం నిర్మిస్తామని కూడా హామీ ఇచ్చారు.

