ఆంధ్ర ప్రదేశ్ లో రోజు రోజుకు కరోనా కేసులు తగ్గుతున్నాయి. నిన్నటి కంటే ఇవాళ కరోనా కేసులు తగ్గాయి. తాజాగా ఏపీ ఆరోగ్యశాఖ కరోనా బులెటిన్ ను రిలీజ్ చేసింది. ఈ బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో ఏపీలో కొత్తగా 4458 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 18,71,475 కు చేరింది. ఇందులో 18,11,157 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా 47,790 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో ఏపీలో కరోనా కారణంగా 38 మంది మృతి చెందారు. దీంతో ఏపీలో ఇప్పటి వరకు కరోనాతో 12,528 మంది మృతి చెందారు. ఇకపోతే గడిచిన 24 గంటల్లో ఏపీలో 6,313 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇక ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా 91,849 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.
							previous post
						
						
					
							next post
						
						
					

