కేంద్రం ప్రకటించిన స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వే 2024-25లో ఇండోర్ వరుసగా 8వ సారి అత్యంత పరిశుభ్రమైన నగరంగా నిలిచింది.
ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా ఐదు అవార్డులు గెల్చుకుని వావ్ అనిపించింది. స్వచ్ఛ సర్వేక్షన్-2025 అవార్డుల కార్యక్రమంలో రాష్ట్రం నుంచి విజయవాడ, తిరుపతి, గుంటూరు, గ్రేటర్ విశాఖపట్నం (జీవీఎంసీ), రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్లు అవార్డులు దక్కించుకున్నాయి.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ అవార్డు స్వీకరించారు.
ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి మనోహర్ లాల్తో పాటు రాష్ట్ర పురపాలక శాఖ అధికారులు, ఆయా కార్పొరేషన్ల అధికారులు పాల్గొన్నారు.
స్వచ్ఛ సర్వేక్షన్ అవార్డులు అందుకోవడం గర్వకారణమని, ఈ విజయానికి కృషి చేసిన అధికారులు, సిబ్బందిని మంత్రి నారాయణ హృదయపూర్వకంగా అభినందించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వచ్ఛ భారత్ మిషన్పై ప్రత్యేక దృష్టి సారించారని మంత్రి తెలిపారు.
ఈ క్రమంలో ప్రతి నెల మూడో శనివారం నియోజకవర్గంలో స్వచ్ఛతా కార్యక్రమాలను నిర్వహిస్తూ ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు.
భవిష్యత్తులో మరిన్ని అవార్డులు సాధించేందుకు రాష్ట్రం సన్నద్ధమవుతోందని, స్వచ్ఛతా కార్యక్రమాలకు ప్రజల సహకారం, అధికారుల అంకితభావం కూడా కీలకమని మంత్రి వెల్లడించారు.


కేసీఆర్ ఇంట్లో కుక్క చనిపోతే డాక్టర్లపై కేసులా ?: విజయశాంతి