telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు సామాజిక

ప్యారడైజ్‌ హోటల్‌ లో జీహెచ్‌ఎంసీ తనిఖీలు.. లక్ష రూపాయల జరిమానా

secunderabad paradise

బిర్యానీకి జాతీయ స్థాయిలో పేరున్న సికింద్రాబాద్‌ ప్యారడైజ్‌ హోటల్‌ లో జీహెచ్‌ఎంసీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. అపరిశుభ్ర వాతావరణం, పాడైపోయిన కూరగాయలు కనిపించడంతో అధికారులు లక్ష రూపాయల జరిమానా విదించారు. గురువారం హోటల్‌కు వచ్చిన ఓ వినియోగదారులు బిర్యానీలో వెంట్రుకలు కనిపించడంతో సిబ్బందిని నిలదీశారు. అయితే సిబ్బంది నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో ఆయన జీహెచ్‌ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేశారు.

ఫుడ్‌సేఫ్టీ ఆఫీసర్‌ సుదర్శన్‌రెడ్డి, ఏఎంహెచ్‌వో రవీందర్‌గౌడ్, వెటర్నరీ ఆఫీసర్‌ శ్రీనివాసరెడ్డిలు హోటల్‌కు వెళ్లి తనిఖీలు నిర్వహించారు. హోటల్‌లో సింగల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ క్యారీబాగులు కనిపించాయి. అలాగే కుళ్లిపోయిన కూరగాయలు వినియోగిస్తుండటం కిచన్‌లో అపరిశుభ్ర వాతావరణం కనిపించింది. దీంతో అధికారులు హోటల్‌ సిబ్బందిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి నోటీసులు జారీ చేసి లక్ష రూపాయల జరిమానా విధించారు. మరోమారు ఇలాగే ఉంటే హోటల్‌ను సీజ్‌ చేస్తామని హెచ్చరించారు.

Related posts