తుపాను బాధితులకు అత్యవసర ఆహార వస్తువులు ఉచితంగా పంపిణీ. ప్రభావిత కుటుంబాలు, మత్స్యకారులకు సరకులు ఉచితంగా అందించాలని ఆదేశం.
మత్స్యకారులకు 50 కేజీల చొప్పున బియ్యం ఇవ్వాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేశారు. కిలో కందిపప్పు, లీటర్ నూనె, కిలో ఉల్లిపాయలు పంపిణీకి ఆదేశం.
కిలో బంగాళదుంపలు, కిలో చక్కెర పంపిణీకి ప్రభుత్వం ఆదేశాలు జారీచేశారు.
వెంటనే సరకుల పంపిణీ ప్రారంభించాలని పౌరసరఫరాల శాఖ కమిషనర్ కు ఆదేశించారు.
ఉల్లిపాయలు, కూరగాయల సరఫరా బాధ్యతలను మార్కెటింగ్ కమిషనర్ కు అప్పగించారు.

