చైనా నుండి వచ్చిన కరోనా మన దేశాన్ని అతలాకుతలం చేస్తుంది. అయితే ఈ వైరస్ కేసులు దేశంలో రోజు రోజుకు పెరుగుతుండటంతో చాలా రాష్ట్రాలు లాక్ డౌన్ విధించాయి. ఈ విధానం కారణంగా కేసులు తగ్గుముఖం పట్టడంతో ఆ లాక్ డౌన్ ను పొడిగిస్తూ వస్తున్నాయి. అందులో తెలంగాణ కూడా చేరిపోయింది. తాజాగా మరో 10 రోజులు లాక్ డౌన్ పొడిగించింది. ఈరోజు ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో ఈ నిర్ణయం తీసుకుంది. కానీ గత లాక్ డౌన్ లో మినహాయింపు ఉదయం 6 నుంచి 10 గంటల వరకు మాత్రమే ఉండగా.. ఈసారి మాత్రం ఆ సమయాన్ని ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు పొడిగించింది. సడలింపు సమయం తర్వాత బయటకు వెళ్లిన వాళ్లు ఇంటికి చేరడానికి మరో గంట పాటు, అంటే మధ్యాహ్నం 2 గంటల వరకు సమయం ఇచ్చారు. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా తెలిపిన మంత్రి కేటీఆర్ త్వరలో అన్ని మార్గదర్శకాలు జారీ చేయబడతాయి అని పేర్కొన్నారు.
previous post