ఇటీవల కాలంలో సోషల్ మీడియా వేదికగా సెలెబ్రిటీలపై నీచమైన కామెంట్లు చేస్తున్న పోకిరీ గాళ్ల సంఖ్య పెరిగిపోయింది. ఇప్పటికే తాజాగా అనసూయపై దారుణమైన పోస్ట్లు పెట్టడంతో ఆమె సైబర్ క్రైమ్ పోలీసుల్ని ఆశ్రయించింది. తాజాగా ‘నచ్చావులే’ హీరోయిన్, బీజేపీ యువ నాయకురాలు మాధవీలతపై వల్గర్ కామెంట్ పోస్ట్ చేశాడు ఓ నెటిజన్. గత కొంతకాలంగా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్న మాధవీలత తన పర్శనల్ విషయాలతో పాటు సోషల్ ఇష్యూస్పై స్పందిస్తూ ఉంటుంది. అయితే ఆమె వాదనలు విమర్శలకు తావివ్వడంతో సోషల్ మీడియాలో డిస్కషన్స్ నడుస్తూ వస్తున్నాయి. తాజాగా సోషల్ మీడియాలో సెలబ్రిటీలను ట్రోల్ చేయడం పట్ల మాధవీలత వివిధ మీడియా ఛానల్స్ డిష్కషన్స్లో పాల్గొని తన వాదనను వినిపించగా.. వీటిపై స్పందిస్తూ ఓ నెటిజన్ ‘ఎవరైనా బీజేపీ వాళ్లు దీన్ని రేప్ చేసి చంపేస్తే.. దరిద్ర్యం వదిలిపోతుంది’ అంటూ నీచమైన కామెంట్ పెట్టాడు. అంతే ఘాటుగా మాధవీలత కూడా స్పందిస్తూ.. ఆ నెటిజన్ పెట్టిన కామెంట్స్ స్క్రీన్ షాట్ తీసి మరీ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. పనిలో పనిగా నోటికి పనిచెప్తూ.. “ఇలాంటి లుచ్చా లంగా కొడుకుల్ని ఏం చేయాలి.. కోసి పారేయాలిగా. ఏం చూసుకుని మగాడ్నని తెగ ఫీల్ అవుతున్నాడో.. వీడి బ్రెయిన్ ఎంత నీఛంగా ఉందో.. ఏమనాలి ఇలాంటి పుండాకోర్ ముండాగాల్లని? నువ్వే డిసైడ్ చెయ్” అంటూ పోస్ట్ చేశారు.

