కమెడియన్ షకలక శంకర్ ఇటీవల లక్షా పది వేల రూపాయలు వెచ్చించి ఓ రైతు కూలీ కుటుంబానికి కాడెద్దులు-నాగలి బహూకరించాడు. తాజాగా కరోనా వైరస్ కారణంగా చితికిపోయిన ఏడు కుటుంబాలను ఆదుకున్నారు. ఆ కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవడానికి కరీంనగర్ వీధుల్లో శంకర్ భిక్షాటన చేశారు. దీని ద్వారా సుమారు 90 వేలు సమకూరగా మిగిలిన డబ్బులు తాను జోడించి, మొత్తం లక్ష రూపాయలతో కరీంనగర్లోని ఏడు కుటుంబాలకు ఆర్థిక సాయం అందించారు. ఈ సేవా కార్యక్రమం తాను చేపట్టేలా ప్రేరేపించి సహకరించిన కరీంనగర్ ‘విందు భోజనం’ మహేంద్ర, వెంకట్ రెడ్డి, గోపాల్ రెడ్డి, బీటీఆర్లకు శంకర్ కృతజ్ఞతలు తెలిపారు. నెలకొక పర్యాయం ఇలాంటి సేవా కార్యక్రమం చేయాలనుకుంటున్నానని, అందుకు ఆ సర్వేశ్వరుడి అనుగ్రహం కోసం వేడుకుంటున్నానని శంకర్ వెల్లడించారు. ఇదిలా ఉంటే, శంకర్ ప్రస్తుతం హీరోగా రెండు సినిమాలు చేస్తున్నారు. ఇటీవలే ‘లాస్ట్ గాడ్ఫాదర్’ అనే సినిమాను శంకర్ మొదలుపెట్టారు. వెలంపల్లి ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘బొమ్మ అదిరింది – దిమ్మ తిరిగింది’ అనే సినిమా కూడా శంకర్ చేస్తున్నారు.
previous post

