“ఏమో ఏమో ఏ గుండెల్లో ఏ బాధ ఉందో.. ఓ కొంచెం పాలు పంచుకుందాం.. ఏమో ఏమో ఏ దారుల్లో ఏ బంధముందో.. బంధువుల సంఖ్య పెంచుకుందాం…” అని అంటున్నారు నందమూరి కల్యాణ్ రామ్. ఈయన కథానాయకుడిగా నటించిన చిత్రం `ఎంత మంచివాడవురా`. సంక్రాంతి సందర్భంగా ఈ చిత్రం జనవరి 15న విడుదలవుతుంది. ఆడియో రంగంలో అగ్రగామిగా వెలుగొందుతున్న ఆదిత్యా మ్యూజిక్ సంస్థ తొలిసారిగా చిత్ర నిర్మాణ రంగంలోకి దిగి ఆదిత్యా మ్యూజిక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ‘శతమానం భవతి’ చిత్రంతో జాతీయ పురస్కారాన్నిగెలుచుకున్న సతీష్ వేగేశ్న దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీదేవి మూవీస్ శివలెంక కృష్ణప్రసాద్ ఈ చిత్రానికి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన తొలి లిరికల్ వీడియో సాంగ్ `ఏమో ఏమో ఏ గుండెల్లో ..`ను చిత్ర యూనిట్ ఆదివారం విడుదల చేసింది. గాన గంధర్వుడు ఎస్.పి.బాల సుబ్రమణ్యం ఈ పాటలను ఆలపించారు. నేషనల్ అవార్డ్ విన్నర్ గోపీసుందర్ బ్యూటీఫుల్ ట్యూన్కి ప్రముఖ పాటల రచయిత రామజోగయ్య శాస్త్రి సాహిత్యాన్ని అందించారు. ఎస్.పి.బాలసుబ్రమణ్యంగారు ఎక్సలెంట్గా పాడిన ఈ పాటకు రామజోగయ్యగారు అమేజింగ్ లిరిక్స్ రాశారు. పాటకు చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది. మీరు కూడా ఈ లిరికల్ వీడియో సాంగ్ ను వీక్షించండి.
previous post
next post