రంజీత్ కౌర్ బాలీవుడ్ హీరో రిషికపూర్ సరసన నటించిన ‘లైలా మజ్ను’ సినిమా ఘనవిజయం సాధించింది. 80వ దశాబ్ధంలో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ బాలీవుడ్ సీనియర్ నటి రంజీత్ కౌర్ తాజాగా వివాదాల్లో చిక్కుకున్నారు. రంజీత్ ఆమె భర్త రాజ్సమంద్ పై దాడి చేయడంతో ఆయన మహారాష్ట్రలోని పూణె పోలీసులకు సీనియర్ సిటిజన్ హెల్ప్లైన్ సాయంతో భార్యపై ఫిర్యాదు చేశారు. తన భార్య రంజీత్ కౌర్, కుమారుడు ఇద్దరూ కలిసి తనను కొడుతున్నారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. అలాగే వారిద్దరూ తనను నాల్గవ ఫ్లోర్ నుంచి తోసివేసే ప్రయత్నం చేశారని ఆరోపించారు. కాగా ఈ ఉదంతంపై రంజీత్ మాట్లాడుతూ అందరి ఇళ్లలో ఇలాంటి గొడవలు సహజమేనని, తన భర్త, కుమారుడు అమెరికాలో వ్యాపారం చేస్తున్నారని, ఈ విషయంలోనే వివాదం జరిగిందన్నారు. ఈ వ్యవహారంలో పోలీసులు జోక్యం చేసుకుని భార్యభార్తలకు కౌన్సెలింగ్ ఇవ్వడంతో సమస్య సద్దుమణిగిందని సమాచారం.
previous post


పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలతో ఉలిక్కిపడ్డ చిత్ర పరిశ్రమ ..