ఆంధ్రప్రదేశ్ శాసనసభ బడ్జెట్ సమావేశాలు రేపు (ఫిబ్రవరి 11, 2026) ఉదయం 10 గంటలకు ప్రారంభం కానున్నాయి.
రేపు ఉదయం 10:30 గంటలకు గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.
ఉదయం 11:30 గంటలకు బిజినెస్ అడ్వైజరీ కమిటీ (BAC) సమావేశం జరుగుతుంది. ఇందులో సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలనే దానిపై నిర్ణయం తీసుకుంటారు .
ఫిబ్రవరి 14న ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పూర్తిస్థాయి బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు.

