మెగాస్టార్ నట వారసత్వం పుచ్చుకొని స్టార్ హీరోగా ఎదిగిన చెర్రీ.. నిర్మాతగా కూడా రాణిస్తున్న సంగతి తెలిసిందే. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్పై భారీ సినిమాలు రూపొందిస్తున్నారు. మరోవైపు స్టార్ హీరోగా కొనసాగుతున్నాడు. అయితే రామ్ చరణ్ మొదటి చిత్రం ‘చిరుత’ విడుదలై నేటితో 13 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా సోషల్ మీడియా ద్వారా ఆ సినిమాను చెర్రీ గుర్తు చేసుకున్నాడు. “అప్పుడే 13 ఏళ్లు పూర్తయ్యాయంటే నమ్మలేకపోతున్నా. గొప్ప విజయాలు.. కొన్ని పరాజయాలు.. అన్నింటినీ ఎంజాయ్ చేశా. అన్ని వేళలా నాకు అండగా నిలిచిన అభిమానులకు ధన్యవాదాలు. మరింత కష్టపడి మిమ్మల్ని సంతోషపెడతాను” అని చెర్రీ ట్వీట్ చేశాడు. అలాగే ‘చిరుత’ చిత్ర దర్శకుడు, ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న పూరీ జగన్నాథ్కు విషెస్ తెలియజేశాడు. అలాగే ‘చిరుత’ యూనిట్ మొత్తానికి ధన్యవాదాలు తెలిపాడు. మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా ‘చిరుత’ సినిమాతో తెరంగేట్రం చేసిన రామ్చరణ్ ఆ తర్వాత మెగాపవర్స్టార్గా ఎదిగాడు. తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు. ప్రస్తుతం ఈ యంగ్ హీరో వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో “ఆర్ఆర్ఆర్” చిత్రంలో ఎన్టీఆర్ తో కలిసి నటిస్తున్నాడు రామ్ చరణ్. చిరంజీవి ఆచార్యలో చిన్న పాత్ర చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత అనిల్ రావిపూడి, గౌతమ్ తిన్ననూరిల్లో ఎవరో ఒకరితో సినిమా చేయబోతున్నాడు చరణ్. ఈ సినిమాల తర్వాత త్రివిక్రమ్ చరణ్ కాంబినేషన్ లో సినిమా స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది.
Can’t believe it’s already been 13 years.
Great highs & a few lows, I’ve cherished every bit of it. Thank you my dearest fans for always standing by me. Humbled by Your love ! Promise to work hard for u guys.— Ram Charan (@AlwaysRamCharan) September 28, 2020