ఆగస్టు 29న నిర్వహించిన నాటా-2020 మొదటి పరీక్ష ఫలితాలను విడుదల చేశారు. ఆర్కిటెక్చర్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించే నేషనల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఆర్కిటెక్చర్ (నాటా) ఫలితాలను కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ (సీఓఏ) ప్రకటించింది. ఫలితాలను అధికారిక వెబ్సైట్ nata.inలో చూడవచ్చని వెల్లడించింది.
నాటా పరీక్షను ఏటా రెండుసార్లు నిర్వహిస్తారు. మొదటి పరీక్ష ఇప్పటికే ముగియగా, రెండో విడత పరీక్షను ఈనెల 12న నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన దరఖాస్తు గడువుకు ఈ నెల 10న ముగియనుంది.