ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచి 23 ఏళ్లయింది అంటూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. విజయసాయి ట్వీట్ కు టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఘాటుగా కౌంటర్ ఇచ్చాడు. తండ్రికి, కొడుక్కి కాంగ్రెస్ పార్టీ రాజకీయ భిక్ష పెట్టిందంటూ వ్యాఖ్యానించారు.
వైఎస్ ను ముఖ్యమంత్రిని చేసిన సోనియా గాంధీకి జగన్ వెన్నుపోటు పొడిచి 9 ఏళ్ల 5 నెలల 11 రోజులు అయిందని ట్వీట్ చేశారు. అంతేకాదు ఈ ట్వీట్ కు విజయసాయిరెడ్డిని, వైసీపీ పార్టీని ట్యాగ్ చేశారు. అంతేకాదు, రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చూడాలన్నది వైఎస్ చివరి కోరిక అని జగనే స్వయంగా చెప్పారని, ఆ విధంగా తండ్రి ఆశయానికి కూడా వెన్నుపోటు పొడిచిన తనయుడు అనిపించుకున్నారని విమర్శించారు.